నిజంనిప్పులాంటిది

Jun 14 2023, 10:37

2 వేల నోటు.. మద్యం షాపుల ద్వారా భారీ దందా❓️

నేతల ఇళ్ల కలుగుల్లోంచి బయటికొస్తున్న నోట్లు

రోజు అమ్మే మద్యం అమ్మకాల్లో 80 కోట్లలో సగం 2 వేల నోట్లే!

రాష్ట్రంలో ఒక్కో మద్యం షాపులో సగటున రోజుకు రూ.2లక్షల వ్యాపారం జరుగుతోంది. ఇందులో దాదాపు సగం అంటే రూ.లక్ష.. రూ.2 వేల నోట్లే వచ్చాయంటూ బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. రూ.2 వేల నోట్లను వ్యక్తిగతంగా బ్యాంకుకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20 వేల పరిమితి ఉంది. అదే మద్యం షాపు ద్వారా అయితే అపరిమితంగా నోట్లు మార్చుకోవచ్చు. మద్యంషాపుల నుంచి వచ్చే నోట్లను బ్యాంకులు తిరస్కరించలేవు. కానీ గత కొద్ది రోజుల నుంచి మద్యం షాపుల నుంచి వస్తున్న నోట్లను చూస్తుంటే బ్యాంక్‌ మేనేజర్లలో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. దీంతో కొన్ని చోట్ల పెద్ద నోట్లు వద్దని చెబుతున్నట్లు తెలిసింది.

షాపులే మార్పిడి కేంద్రాలు...

గత రెండు మూడేళ్ల నుంచి రూ.2వేల నోట్లు దాదాపుగా కనుమరుగయ్యాయి. బ్యాంకులకు వెళ్లిన నోట్లను ఆర్‌బీఐ తీసుకుని, వాటి స్థానంలో ఇతర చిన్న నోట్లు ముద్రించింది. దీంతో దాదాపుగా రూ.2వేల నోట్లు లేవనే అందరూ భావించారు. గత నెల 19న ఆ నోట్లను ఉపసంహరించుకున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించగానే అనూహ్యంగా ఇప్పటివరకూ కనిపించకుండా పోయిన గులాబీ నోట్లు వెలుగులోకి వచ్చాయి. బ్యాంకులకు వెళ్లి మార్చుకోవాలంటే రూ.20వేల పరిమితి ఉంది. ఒకేసారి రూ.50వేలు దాటి జమచేస్తే పాన్‌ నంబరు ఇవ్వాలి. దీంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించిన రాజకీయ నేతలు... మద్యం షాపులను ఎంచుకున్నారు. ఎందుకంటే రాష్ట్రంలోని 2934 మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో నడుస్తున్నాయి. అక్కడ పనిచేసే సేల్స్‌మెన్‌, సూపర్‌వైజర్లు అంతా అధికార పార్టీకి సన్నిహితులే. రాష్ట్రంలో రోజుకు రూ.80కోట్ల మద్యం వ్యాపారం సాగుతుంటే అందులో దాదాపు రూ.60కోట్లు ఈ షాపుల్లోనే జరుగుతోంది. ఇప్పుడు ఆ నగదులో ఎక్కువగా గులాబీ నోట్లే కనిపిస్తున్నాయి.

ఎలా చేస్తున్నారు?

ప్రభుత్వ మద్యం షాపుల్లో రోజుకు రూ.లక్షన్నర నుంచి రూ.3లక్షల అమ్మకాలుంటాయి. అందులో రూ.2వేల నోట్లను చేర్చేందుకు పలు మార్గాలను ఎంపిక చేసుకున్నారు. తొలుత కొందరు నాయకులు వారి డ్రైవర్లు, అటెండర్లకు పెద్ద నోట్లు ఇచ్చి మద్యం కొనుగోళ్ల ద్వారా మార్పించే ప్రయత్నాలు చేశారు. అయితే ఒకట్రెండు రోజుల తర్వాత....ఇలా చేస్తే సెప్టెంబరు నాటికి మొత్తం నోట్లు మార్చడం సాధ్యపడదని తేలిపోయింది. దీంతో ఒకేసారి నోట్లు మార్చుకునేలా షాపుల్లోని సూపర్‌వైజర్లతో డీల్‌ మాట్లాడారు. ఎలాగూ మనోళ్లే కావడం, మరీ కాదంటే ఎంతోకొంత కమీషన్‌ ఇచ్చి అయినా నోట్లు మార్చేలా సెట్‌ చేశారు. వాస్తవానికి షాపుల్లో సామాన్య వినియోగదారులు రూ.2వేల నోటు ఇస్తే తీసుకోవడం లేదు. కనీసం రూ.వెయ్యికి పైగా కొనుగోలు చేస్తేనే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలో మందు తాగేవాళ్లలో ఎవరూ రూ.వెయ్యి కొనుగోళ్లు చేయరు. అలాంటప్పుడు ఇన్ని పెద్ద నోట్లు షాపులకు ఎలా వస్తున్నాయి? అంటే డీల్‌ సెట్‌ చేసుకున్న వారు రోజూ ఉదయం సూపర్‌వైజర్లకు మార్చాల్సిన నోట్లు ఇస్తారు. అనంతరం ఆ మేరకు వ్యాపారం జరిగాక ఫోన్‌ చేయగానే నేతల మనుషులు వచ్చి వాటిని తీసుకెళ్తారు. మరికొన్ని చోట్ల రోజంతా వ్యాపారం సాగుతుంది. తర్వాత రోజు ఉదయం ఆ నగదును బ్యాంక్‌లో జమ చేసే సమయంలో చిన్న నోట్ల స్థానంలో రూ.2వేల నోట్లు పెడుతున్నారు. మరికొందరు చోటా నేతలు బెల్టు షాపుల కోసం పెద్దఎత్తున కొనుగోలు చేసే మద్యాన్ని పూర్తిగా రూ.2వేల నోట్లతోనే కొంటున్నారు.

పెట్రోల్‌ బంకుల్లోనూ...

మద్యం షాపుల్లో అమ్మే రూ.60 కోట్లలో దాదాపుగా రూ.40 కోట్లు పెద్దనోట్లేనని తెలిసింది. ఇవి కాకుండా కొందరు పెట్రోల్‌ బంకులను నోట్ల మార్పిడికి కేంద్రాలుగా మార్చుకుంటున్నారు. రూ.10కోట్ల మేర మార్చేస్తున్నారు. వెరసి..ఒక్క రోజులోనే .50కోట్లు విలువైన పెద్ద నోట్లను చిన్న నోట్లుగా మార్చుకుంటున్నారు. ఇలా నెలలో 1500కోట్ల వరకు మార్చేఅవకాశం ఉంది..........

నిజంనిప్పులాంటిది

Jun 14 2023, 10:34

ఐదేళ్ల బాలికపై యువకుడు హత్యాచారం

ఐదేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారయత్నం చేశాడు! గమనించిన స్థానికులు పట్టుకోబోగా పాపను చంపేస్తానని బెదిరించాడు. ఆపై ఓ బండరాయితో చిన్నారి తల, కన్నుపై భాగంలో గట్టిగా కొట్టాడు. ఈ ఘటనలో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి! హైదరాబాద్‌ నల్లకుంటలో మంగళవారం సాయంత్రం ఈ దారుణం జరిగింది.

బాలిక తల్లి, పోలీసుల వివరాల ప్రకారం.. ఏపీలోని రాయలసీమకు చెందిన దంపతులకు ఇద్దరు అమ్మాయిలు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త, మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని భార్యాపిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని స్థితిలో జీవనోపాధికోసం ఆమె తన ముగ్గురు పిల్లలను వెంటబెట్టుకొని హైదరాబాద్‌లోని కాచిగూడకు చేరుకుంది. అక్కడి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులను యాచిస్తూ వచ్చిన చిల్లర డబ్బులతో తన పిల్లలను పోషించుకుంటోంది.

మంగళవారం ఉదయం 10 గంటలకు రైల్వే స్టేషన్‌లో ఉండగా పెద్ద కుమార్తె అయిన ఐదేళ్ల బాలిక మంచినీళ్లు తెచ్చేందుకు స్టేషన్‌లోని నల్లా వద్దకు బాటిల్‌ తీసుకుని వెళ్లింది.

వెళ్లిన చిన్నారి ఆరగంట గడిచినా తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లి.. కుళాయి వద్దకు వెళ్లి చూడగా అక్కడ కుమార్తె కనిపించలేదు. పాపను ఓ యువకుడు ఎత్తుకొని వెళ్లాడం తాను చూశానంటూ ఆమెకు ఓ వ్యక్తి చెప్పడంతో వెంటనే కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. పోలీసులు సీసీ ఫుటేజీలు చూడగా బాలికను 25-30 ఏళ్ల యువకుడు ఎత్తుకొని పోతున్నట్లు కనిపించింది.

పాపను ఆ యువకుడు నల్లకుంట ఫీవర్‌ ఆస్పత్రి ఎదురుగా ఉన్న నాలుగో వీధికి తీసుకెళ్లి రెండు వాహనాల మధ్య ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. పాప బిగ్గరగా రోదించడంతో స్థానికులు గమనించి అతడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తనను పట్టుకుంటే పాపను చంపుతానని, ఓ బండ రాయితో చిన్నారి తల, ఎడమ కన్నుపై గట్టిగా కొట్టాడు. దీంతో పాపకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఘటనాస్థలికి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పాపను చికిత్స కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేశారు...

నిజంనిప్పులాంటిది

Jun 14 2023, 10:32

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ దాడులు, 70 బృందాలతో తనిఖీలు..

హైదరాబాద్ : బుధవారం ఉదయంనుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, సిబ్బంది ఇళ్లలో ఐటీ సోదాలు.. నిర్వహిస్తోంది. మొత్తం 70 బృందాలు ఈ తనిఖీల్లో పాల్గొన్నాయి.

ఈ సోదాలు మూడు రోజులపాటు కొనసాగే అవకాశం ఉంది. బీఆర్ఎస్ భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి అనేక కంపెనీల్లో బినామీగా ఉన్నాడని.. 15 కంపెనీల్లో పెట్టుబడిదారుగా ఉన్నారని అంటున్నారు.

ఎమ్మెల్యే ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది..

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 14 2023, 10:26

Earthquake:| జమ్ముకశ్మీర్‌లోని కత్రా ప్రాంతంలో భూకంపం..

ఉత్తర భారతాన్ని భూకంపం భయపెడుతోంది. మంగళవారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో భూ కంపం సంభవించింది. ఢిల్లీ, జమ్ము కశ్మీర్, పంజాబ్, చంఢీగఢ్ రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు సంభవించినట్టు భూకంప అధ్యయన కేంద్రం ప్రకటించింది..

సుందరమైన జమ్ముకశ్మీర్‌లోని ప్రజలు వరుస భూకంపాలతో బెంబేలెత్తిపోతున్నారు. వరుసగా రెండు రోజుల నుంచి కశ్మీర్‌లో భూకంపాలు వస్తుండటంతో ప్రజలు తీవ్ర భయకంపితులవుతున్నారు.

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం దోడా ప్రాంతంలో భూకంపం సంభవించగా, బుధవారం తెల్లవారుజామున కత్రాకు దగ్గరలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున 2.20 గంటలకు కత్రాలో భూకంపం వచ్చింది.

దీని తీవ్రత రెక్టర్‌ స్కేల్‌పై 4.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం కత్రాకు 81 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూఅంతర్భాగంలో 10 లోతులో ప్రకంపనలు సంభవించినట్టు ఎన్‌సీఎస్‌ పేర్కొంది..

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 20:49

4 వారాలు ఆలస్యంగా తెలంగాణలోకి రుతుపవనాలు..

Monsoon: దేశంలోకి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1న లేదు రెండుమూడు రోజుల తేడాతో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది వారం ఆలస్యంగా కేరళను రుతుపవనాలు తాకాయి..

బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఏర్పడే అవకాశం లేదు. కాబట్టి దేశంలోని చాలా ప్రాంతాలకు ఈ ఏడాది రుతుపవనాలు కాస్త ఆలస్యంగా ప్రవేశించే అవకాశముందని వాతావరణ నివేదికలు, వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తెలంగాణకు సైతం రుతుపవనాలు ఆలస్యంగా చేరుకుంటాయని నివేదికలు చెబుతున్నాయి.

తెలంగాణలో రుతుపవనాల రాక దాదాపు నాలుగు వారాలు ఆలస్యమవుతుందని ప్రయివేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఒక నివేదికలో తెలిపింది. బంగాళాఖాతంలోని వాతావరణ వ్యవస్థలు రుతుపవనాల ప్రధాన చోదకాలుగా భావిస్తారు. బంగాళాఖాతంలో ఇలాంటి వ్యవస్థ ఇప్పట్లో ఆవిర్భవించే అవకాశం లేకపోలేదని నివేదిక పేర్కొంది. "స్కైమెట్ ఎక్స్‌టెండెడ్ రేంజ్ ప్రిడిక్షన్ సిస్టమ్ (ERPS) జూన్ 09, జూలై 06 మధ్య వచ్చే 4 వారాలపాటు దుర్భరమైన దృక్పథాన్ని అంచనా వేస్తోంది" అని వాతావరణ సూచన నివేదిక తెలిపింది..

మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, బీహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లోని కోర్ మాన్‌సూన్ జోన్‌లు తప్పనిసరిగా రుతుపవనాల వర్షాలు అవసరమని నివేదిక పేర్కొంది. స్కైమెట్ నుండి వచ్చిన నాలుగు వారాల అంచనా మ్యాప్ ఈ కాలంలో రాష్ట్రంలోని చాలా భాగం మితమైన పొడి నుండి చాలా పొడిగా ఉంటుందని అంచనా వేసింది. అరేబియా సముద్రంలో బిపర్జోయ్ తుఫాను అభివృద్ధి చెందుతుండటంతో నైరుతి రుతుపవనాల నిరీక్షణ భారత్ కు మరికొంత కాలం ఉండవచ్చని గత వారం భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది.

ప్రస్తుత ప్రభావాల కారణంగా జూన్ 15 వరకు గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉన్నందున, సోమవారం, భారత వాతావరణ శాఖ (IMD) తెలంగాణలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఎండల తీవ్రతతో పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సాయంత్రం సమయంలో పలు ప్రాంతాల్లో చిరు జల్లులు సైతం పడే అవకాశముందని తెలిపింది..

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 18:07

రేపట్నుంచి తెలంగాణ పది సప్లిమెంటరీ ఎగ్జామ్స్...!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం జూన్ 14 నుంచి జరగనున్నాయి. ఈ పరీక్షలకు 71,681 మంది దరఖాస్తు చేసుకున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు.

పది సప్లిమెంటరీ పరీక్షలకు 259 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. మొత్తం 2,800 మంది ఇన్విజిలేటర్లను నియమిస్తున్నామని చెప్పారు.

50 ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు పర్యవేక్షిస్తాయని ఆయన తెలిపారు. ఇక ఇప్పటికే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్‌ టికెట్లు కూడా విడులైన సంగతి తెలిసిందే.

SB NEWS

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 17:52

Jammu Kashmir: సరిహద్దు దాటేందుకు యత్నించిన ఉగ్రవాదులను హతమార్చిన ఆర్మీ..

జమ్మూ కాశ్మీర్ లో అలజడి రేపేందుకు పాకిస్తాన్ ఎప్పుడూ కుయుక్తులు పన్నుతూనే ఉంది. భారత్-పాకిస్తాన్ మధ్య నియంత్రణ రేఖను దాటించి ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేస్తోంది..

ఇప్పటికే సరిహద్దును ఆనుకుని పాకిస్తాన్ వైపు ఉగ్రవాదలు లాంచింగ్ ప్యాడ్స్ సిద్ధంగా ఉన్నాయి. అదును దొరికితే వారిని భారత్ లోకి పంపేందుకు చూస్తోంది పాకిస్తాన్ ఆర్మీ. 

ఇదిలా ఉంటే తాజాగా ఈ రోజు ఇద్దరు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి భారత్ లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. దీంతో అప్రమత్తం అయిన భద్రతా బలగాలు ఉగ్రవాదులిద్దర్ని కాల్చి చంపేశాయి.

ఈ ఘటన జమ్మూ కాశ్మీర్ లోని కుప్వారా జిల్లా మచిల్ సెక్టార్ లో చోటు చేసుకుంది. ఇద్దరు ఉగ్రవాదులను ఎల్ఓసీ వద్ద ఆర్మీ, కుప్వారా పోలీసులు జాయింట్ ఆపరేషన్ లో హతమార్చినట్లు కాశ్మీర్ జోన్ పోలీసులు ట్వీట్ చేశారు. గత నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ20 సమ్మిట్ ను భగ్నం చేసేందుకు ఇలాగే పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాదులను జమ్మూ కాశ్మీర్ లోకి పంపే ప్రయత్నం చేసింది.

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 13:28

70 వేల మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగం బహుమతిగా పంపిణీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఈరోజు జాబ్ మేళా సందర్భంగా 70 వేల మంది యువతకు నియామక పత్రాలను ప్రధాని నరేంద్ర మోదీ పంపిణీ చేశారు. ఈ యువకులకు ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగాలు కల్పించారు.

ఈరోజు ఉదయం 10:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కొత్తగా నియమితులైన దాదాపు 70,000 మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు.

దేశంలోని 43 చోట్ల నిర్వహించే ఉపాధి మేళా కింద ఈ జాయినింగ్ లెటర్లను పంపిణీ చేశారు. రోజ్‌గర్ మేళా అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రత్యేక చొరవ, దీని కింద అపాయింట్‌మెంట్ లెటర్‌లు త్వరగా మరియు ఎటువంటి అవాంతరాలు లేకుండా ఇవ్వబడతాయి.

రానున్న కాలంలో ఉపాధి కల్పించడంలో ఉపాధి మేళా కీలక పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అదే సమయంలో, ఇది యువతకు వారి సాధికారత మరియు దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కోసం అర్ధవంతమైన అవకాశాలను ఇస్తుంది. ప్రధానమంత్రి చొరవతో యువతలో ఆనంద వాతావరణం కనిపించింది.

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 11:52

15న నాగపూర్‌ బీఆర్‌ఎస్‌ భవనం ప్రారంభం.. కేసీఆర్‌ చేతుల మీదుగా శ్రీకారానికి చర్యలు

బీఆర్‌ఎస్‌ తన తొలి సొంత శాశ్వత భవనాన్ని మహారాష్ట్రలో ప్రారంభించబోతున్నది. నాగపూర్‌లో సువిశాలమైన కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. ఆ భవనాన్ని ఈ నెల 15న పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

15న ఉదయం నాగపూర్‌ వెళ్లనున్న కేసీఆర్‌.. అక్కడ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు స్థానికంగా ఏర్పాటు చేసిన చేరికల సమావేశంలోనూ పాల్గొంటారు.

ముంబై, పుణె, ఔరంగాబాద్‌లోనూ పార్టీ ఆఫీస్‌లను ఏర్పాటుకు నిర్ణయించారు. ఇందుకు పార్టీ భవనాల కోసం అన్వేషణ జరుగుతున్నది.

బీఆర్‌ఎస్‌కు మహారాష్ట్ర ప్రజలు బ్రహ్మరథం పడుతుండగా, పార్టీ సభ్యత్వ నమోదు, కమిటీల నియామక కార్యక్రమాన్ని చేపట్టింది. అటు.. ఈ నెల 19న నాందేడ్‌లో పార్టీ అధినేత కేసీఆర్‌ రెండు రోజుల పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు...

నిజంనిప్పులాంటిది

Jun 13 2023, 08:37

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల: జూన్ 13

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు (మంగళవారం) టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 31 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.41 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. నిన్న (సోమవారం) శ్రీవారిని79,087 మంది భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి 35,640 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

SB NEWS

SB NEWS